
యుపిఐ పేమెంట్ కోసం గూగుల్ పే ‘ట్యాప్ టు పే’ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఎన్ఎఫ్సీ (నియర్– ఫీల్డ్ కమ్యూనికేషన్) సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉంది. దీని సాయంతో యూజర్లు దుకాణాల్లోని సపోర్టెడ్ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టర్మినల్ మీద ఫోన్ని ట్యాప్ చేసి, యుపిఐ పేమెంట్స్ చేయొచ్చు. యుపిఐ కోడ్ లేదా క్యుఆర్ కోడ్ స్కాన్ చేయ కున్నా పర్లేదు. అంతేకాదు యుపిఐ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ టైప్ చేయాల్సిన అవసరం లేదు.