
ఫొటోగ్రాఫర్, వెలుగు : టీ హబ్లో శనివారం నిర్వహించిన ‘మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్– బ్యూటిఫుల్ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్’ గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. విభిన్న రంగాలకు చెందిన 50 మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ర్యాంప్పై వయ్యారాల నడకలతో హొయలు పోయారు. వీరిలో డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులు ఉన్నారు. సినీ హీరోయిన్ వితికా షేరు, హీరో వరుణ్ సందేశ్, నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు పాల్గొన్నారు.