రామాయంపేటలో సెల్‌‌బే షోరూమ్‌‌

రామాయంపేటలో సెల్‌‌బే షోరూమ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  మొబైల్‌‌ ఫోన్లను అమ్మే సెల్‌‌బే  రామాయంపేట (మెదక్‌‌ జిల్లా) టౌన్‌‌లో  కొత్త షోరూమ్‌‌ను ప్రారంభించింది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్‌‌, స్మార్ట్ వాచ్‌‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌‌టాప్‌‌లు అమ్ముతారు. షోరూమ్‌‌ ఓపెనింగ్ సందర్భంగా  సెల్‌‌బే కొన్ని ఆఫర్లను ప్రకటించింది. మొదటి వెయ్యి మంది కస్టమర్లకు  బ్రాండెడ్‌‌ నెక్‌‌బ్యాండ్‌‌ను రూ. 99 కి అందిస్తోంది.  ఆండ్రాయిడ్ టీవీ ధరలు  రూ. 7,999 నుంచి ఉన్నాయి-. 

 కొన్ని ప్రత్యేక బ్రాండెడ్ టీవీలపై సౌండ్ బార్ విత్ వూఫర్స్‌‌ను ఉచితంగా సంస్థ ఆఫర్ చేస్తోంది.  ఐఫోన్ రూ.2,705   ఈఎంఐకే  పొందొచ్చు.  ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై ఒక కచ్చితమైన బహుమతిని సెల్‌‌బే ఆఫర్ చేస్తోంది.  తమ ఉత్పత్తులు,  సేవల  ద్వారా వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తున్నామని  కంపెనీ  ఎండీ  సోమ నాగరాజు అన్నారు.