హైదరాబాద్ అంతా రామమయం

హైదరాబాద్ అంతా రామమయం

 బషీర్​బాగ్/అంబర్​పేట్, వెలుగు  : శ్రీరామనవమి సందర్భంగా నగరం జై శ్రీరామ్ ​నినాదాలతో మార్మోగింది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు శోభాయాత్రలతో సిటీ కాషాయమయమైంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్​ చౌరస్తా వరకు, గోషామహల్ ​ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆధ్వర్యంలో ధూల్​పేట్ ​ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి  హనుమాన్ ​వ్యాయామశాల వరకు.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో అంబర్​పేట నుంచి కాచిగూడ వరకు శోభాయాత్రలు నిర్వహించారు. శోభాయాత్రల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 వేల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్​ కమాండ్​కంట్రోల్​ సెంటర్ ​నుంచి పర్యవేక్షించారు.