
పోర్ట్లూయిస్: రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్వెల్కమ్ లభించింది. పోర్ట్లూయిస్లోని సీవోసాగర్రామ్గూలం ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్లో దిగిన ఆయనకు 200 ప్రముఖులతో కలిసి ఆ దేశ ప్రధాని నవీన్చంద్ర రామ్గూలం పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. బిహారీ సంప్రదాయ ‘గీత్గవాయ్’ ప్రదర్శనతో ప్రవాస భారతీయ మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ.. ‘భారత్మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు.
మారిషస్లో ప్రవాస భారతీయులనుంచి లభించిన ఆత్మీయ స్వాగతం తనను ఎంతగానో కదిలించిందని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ వారసత్వం, సంస్కృతి, విలువలతో కూడిన వారి బలమైన బంధం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ చరిత్ర, బంధం తర్వాతి తరాలకు వర్ధిల్లుతూనే ఉండాలని అన్నారు. అలాగే, ఎయిర్పోర్ట్లో తనను ప్రత్యేకంగా ఆహ్వానించిన మిత్రుడు నవీన్చంద్ర రామ్గూలంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రధాని మోదీ మారిషస్లో రెండు రోజులు పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
మోదీకి అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత అవార్డు ‘ది గ్రాండ్కమాండర్ఆఫ్ది ఆర్డర్ ఆఫ్ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారు. ఆయనతో కలిసి మారిషస్జాతిపిత సీవోసాగర్ రామ్గూలం పేరు మీదుగా ఏర్పాటు చేసిన గార్డెన్ను సందర్శించారు. అక్కడ ‘ఏక్ పేడ్మా కే నామ్’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రధానులు ఇద్దరూ బేల్యాపిల్ మొక్కలు నాటారు. కాగా, మారిషస్ ప్రెసిడెంట్ధరమ్గోకుల్తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. త్రివేణి సంగమ జలంతో పాటు అరుదైన కానుకలు అందజేశారు.