ఫ్రెండ్స్​ ఎంత విలువైన వారో తెలుసా..

ఫ్రెండ్స్​ ఎంత విలువైన వారో తెలుసా..

ఎన్నేళ్లయినా.. చిన్ననాటి ఙ్ఞాపకాలు అంటే ఎంతో ఇష్టపడతారు.  ఎంత ఆపదలో ఉన్నా.. ఎన్ని కష్టాల్లో ఉన్నా.. స్కూల్​ ఫ్రెండ్స్​.. కాలేజీ ఫ్రెండ్స్​.. కనిపిస్తే చాలు.. 50 ఏళ్ల వయస్సులో మంచంపై లేవలేని స్థితిలో ఉన్నా ఎగిరి గంతేస్తాం.. ఇప్పుడు అలానే ఓ 50 ఏళ్ల అమ్మమ్మను తన చిన్ననాటి స్నేహితులను తన మనుమడు కలిపాడు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే...

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన అమ్మమ్మను 50 ఏళ్లుగా చూడని చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలపడం ద్వారా కన్నీళ్లను తెప్పించాడు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను 50 సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి స్నేహితులతో తిరిగి కలపడం ద్వారా ఆశ్చర్యపరిచింది. ఎమోషనల్ రీయూనియన్, వీడియోలో డాక్యుమెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాయూజర్స్​ కొంతమంది  చిరునవ్వులు.. మరి కొంతమందికి కన్నీళ్లను తెప్పించింది. అనీష్ భగత్ పోస్ట్​ చేసిన వీడియోలో  ఈ మిషన్‌ను ఎందుకు ప్రారంభించాడో  వివరించాడు.  ఊపిరితిత్తుల సమస్యల కారణంగా అతని అమ్మమ్మ ఆసుపత్రిలో చేరింది. ఆమెను సంతోషంగా ఉంచేందుకు ఇలా చేయాలని  నిర్ణయించుకున్నానని తెలిపాడు.  

Also Read :- పాల ధరలు పెరుగుతున్నాయి.

తన అమ్మమ్మ 50 ఏళ్లుగా చూడని చిన్ననాటి స్నేహితులను, ఆమె తన స్కూల్​, కళాశా ఫ్రెండ్స్​ ను కలవాలనుకుంది.  ఈ విషయంలో సెర్చ్​ చేసిన ఆమె మనుమడు అనిష్​ తన స్నేహితులను గుర్తించాడు.  బెంగళూరులోని వారి ఇంటిలో లభించిన పుస్తకంలో ఆమె తన స్నేహితులను కలవాలని ఉందని రాసి ఉంది.  ఆ పుస్తకం ద్వారా ఆమె స్నేహితులను గుర్తించాడు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anish Bhagat (@anishbhagatt)

 అతని అమ్మమ్మ తన చిరకాల స్నేహితులను గుర్తించడానికి మొదట కష్టపడింది.  ఆతరువాత తన చిన్ననాటి స్నేహితులని తెలుసుకుని  కౌగిలించుకుంది. ఒక స్నేహితురాలు, “ అబ్ భీ కిత్నీ సుందర్ లాగ్ రి హై (ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు)” అని కామెంట్​ చేసింది.  ఇంకా చాలామంది స్నేహితులు తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు.  మిలియన్ల మంది ఈ పోస్ట్​ పై స్పందించారు. ఈఘటన  ఇంటర్నెట్‌ను మంత్రముగ్ధులను చేసింది. స్నేహం విలువ శాశ్వతమని చాలామంది కామెంట్​ చేశారు