60 రకాల ద్రాక్ష పండ్లు.. రుచి చూడాల్సిందే!

60 రకాల ద్రాక్ష పండ్లు.. రుచి చూడాల్సిందే!
  • గ్రేప్​ ఫెస్టివల్ కు  తరలివస్తున్న సందర్శకులు 

రాజేంద్రనగర్‌‌‌‌ ద్రాక్ష పరిశోధన క్షేత్రంలో ‘గ్రేప్​ ఫెస్టివల్’ సందడిగా సాగుతోంది. సిటీ నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఇక్కడ ఆర్గానిక్​పద్ధతిలో పండించిన 60 రకాల ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉన్నాయి. తోటలో కలియ తిరుగుతూ కావాల్సినన్ని పండ్లు తినొచ్చు. నచ్చిన రకం ద్రాక్ష తీసుకోవచ్చు. ఈ గ్రేప్​ ఫెస్టివల్​ గురువారం మొదలైంది. 15 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సందర్శకులను తోటలోకి అనుమతిస్తున్నారు. వెరైటీని బట్టి ధరలు ఉన్నాయి. 

రెడ్‌‌‌‌ గ్లోబ్, క్రిమ్‌‌‌‌సన్‌‌‌‌ సీడ్‌‌‌‌లెస్, ప్లేమ్‌‌‌‌ సీడ్‌‌‌‌ లెస్, రిజామత్, టేబుల్‌‌‌‌ వెరైటీస్, జ్యూస్‌‌‌‌, వైన్‌‌‌‌, ఇంపోర్టెట్‌‌‌‌ తదితర వెరైటీ ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి వస్తున్న సందర్శకులతో ద్రాక్ష తోట రోజంతా సందడిగా ఉంటోంది.