
ఎలక్ట్రిక్ టూవీలర్లు తయారు చేసే హైదరాబాద్కు చెందిన గ్రావ్టన్క్వాంటా ఈ–స్కూటర్ను లాంచ్ చేసింది. ధర రూ.1.2 లక్షలు. ఇందులోని లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎమ్ఎఫ్పీ) బ్యాటరీని సాధారణ బ్యాటరీల కంటే ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ ప్రకటించింది. బండిని ఒక్కసారి చార్జ్చేస్తే 130 కిలోమీటర్లు వెళ్తుంది. కేవలం 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. దాదాపు 250 కిలోల బరువును మోయగలుగుతుంది.