గ్రూప్ 2,3 వాయిదా అంటూ ఫేక్ న్యూస్..టీజీపీఎస్సీ వివరణ

గ్రూప్ 2,3 వాయిదా అంటూ ఫేక్ న్యూస్..టీజీపీఎస్సీ వివరణ

హైదరాబాద్, వెలుగు : గ్రూప్‌‌ 2, గ్రూప్‌‌- 3 పరీక్షలు వాయిదా వేసినట్టుగా జరుగుతున్న ప్రచారమంతా ఫేక్ న్యూస్ అని టీజీపీఎస్సీ ప్రకటించింది. కమిషన్ నుంచి ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదని వెల్లడించింది.  గ్రూప్‌‌ -2 పరీక్షలను ఈ ఏడాది నవంబర్‌‌ 17, 18 తేదీల్లో

గ్రూప్‌‌ -3 పరీక్షలను నవంబర్‌‌ 24, 25 తేదీలకు వాయిదా వేసినట్టుగా టీజీపీఎస్సీ పేరుతో సోషల్ మీడియాలో ఓ వెబ్ నోట్ వైరల్ అయింది. అయితే, ఇదంతా ఫేక్ న్యూస్ అని, తాము ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ప్రకటించారు.