
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్2 మెయిన్స్ ఎగ్జామ్ ఆదివారం(ఫిబ్రవరి 23) యథాతధంగా నిర్వహించనున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీపీ ఎస్సీ స్పందించింది. పరీక్ష వాయిదా వేయలేదని స్పష్టం చేసింది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై గందరగోళం తలెత్తిన క్రమంలో సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. లేఖపై స్పందించిన ఏపీపీఎస్సీ.. ఎగ్జామ్ ను వాయిదావేయడం లేదని తేల్చి చెప్పింది.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ జరగనుండగా.. కొంతమంది అభ్యర్థుల విజ్ణప్తి మేరకు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ సెక్రటరీకి లేఖ రాసింది.. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణకు అభ్యర్థులనుంచి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
అయితే రాష్ట్రప్రభుత్వ విజ్ణప్తిని ఎపీపీఎస్సీ తిరస్కరించింది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఆదివారం యథాతధంగా జరుగుతాయని ప్రకటించింది. రోస్టర్ అంశంపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.
మరోవైపు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణపై తలెత్తిన గందరగోళంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎగ్జామ్స్ నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో రోడ్లపై గ్రూప్ 2 అభ్యర్థులు భైఠాయించడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.