ఇండియాలో పెరుగుతున్న జీసీసీలు..10 లక్షల ఉద్యోగాలకు అవకాశం

ఇండియాలో పెరుగుతున్న జీసీసీలు..10 లక్షల ఉద్యోగాలకు అవకాశం
  • 2030 నాటికి 2,200 కు  పెరగనున్న జీసీసీలు
  • రెవెన్యూ  రూ.8.71 లక్షల కోట్లను టచ్ చేస్తుందని అంచనా
  • ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరుకునే అవకాశం
  • నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-జిన్నోవ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడి

న్యూఢిల్లీ: తక్కువ శాలరీలకే పనిచేసేటోళ్లు దొరకడం, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ ఖర్చులు, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఫేవరబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో  మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు) ఇండియాలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీల) ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గత ఐదేళ్లలో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెంగళూరు,  ముంబై, గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పూణె, ఢిల్లీ–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో భారీగా జీసీసీలు ఏర్పాటయ్యాయి. 

ప్రస్తుతం ఇండియాలో 1,700 జీసీసీలు ఆపరేట్ అవుతున్నాయని  అంచనా. 2030 నాటికి ఫార్చ్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 500 కంపెనీల్లోని 70 శాతం కంపెనీలకు ఇండియాలో జీసీసీలు ఉంటాయని నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసిన రిపోర్ట్ అంచనా వేస్తోంది. గత ఐదేళ్లలో ఇండియాలో భారీగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు నెలకొన్నాయని తెలిపింది. 

2030 నాటికి వీటి రెవెన్యూ ఏడాదికి 99–105 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 8.71 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని అంచనా వేసింది.  ప్రస్తుతం జీసీసీలతో 64.6 బిలియన్ డాలర్ల  (సుమారు రూ. 5.36 లక్షల కోట్ల)  రెవెన్యూ జనరేట్ అవుతోంది. 9–10 శాతం గ్రోత్ నమోదవుతుందని అంచనా.  

‘ఇండియా జీసీసీ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ది 5–ఇయర్ జర్నీ’ పేరుతో  రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జిన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేశాయి. దీని ప్రకారం, ఇండియాలో జీసీసీలు 2030 నాటికి 2,100–2,200 కి చేరుకుంటాయి. 

ఇండియాకి క్యూ కడుతూ..

ఇండియా నుంచే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించడానికి ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు మొగ్గు చూపుతున్నాయి. జీసీసీలు విస్తరించడానికి ఇదొక కారణం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఫోకస్ పెరగడం కలిసి వస్తోంది. ఇండియాలోని సుమారు 500 కి పైగా జీసీసీఐలు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కొత్త తరం టెక్నాలజీతో నడుస్తున్నాయి. 

ఇండియాలోని  జీసీసీలు, సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఓఈ) లలో సుమారు 1,20,000 ఏఐ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారని అంచనా.  కార్యకలాపాలను జరిపే సెంటర్ల నుంచి ఇన్నొవేటివ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా ఈ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కేపబిలిటీ సెంటర్లు ఎదుగుతున్నాయని నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సింధూ గంగాధరన్ అన్నారు. 

ఇవి విస్తరించే కొద్దీ కంపెనీల గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాల్లో కీలంగా మారుతున్నాయని, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాను గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. జీసీసీలు విస్తరిస్తుండడంతో వీటిలో పనిచేసే ఉద్యోగులు కూడా పెరుగుతున్నారు.  ఈ సెంటర్లలో ప్రస్తుతం 19 లక్షల మంది పనిచేస్తుండగా, 2030 నాటికి ఈ నెంబర్  25–28 లక్షలకు పెరుగుతుందని అంచనా. 

జీసీసీలు టైర్ 2, టైర్ 3 సీటీలలో  కూడా విస్తరించడంతో పాటు, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2000 ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇండియాలో సెంటర్లను ఏర్పాటు చేయడంతో  2018–19 నుంచి 2023–24 మధ్య ఈ సెంటర్లు జనరేట్ చేసే రెవెన్యూ 60 శాతం పెరిగింది.

ఇవి క్రియేట్ చేసిన ఉద్యోగాలు 36 శాతం పెరిగాయి.  ప్రపంచానికి జీసీసీ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా మారిందని, ప్రతీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియాలో ఏదోలా ప్రాతినిధ్యం ఉందని జిన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ పారి నటజరాజన్ అన్నారు.