తెలంగాణ సివిల్ ​సప్లయ్స్​పథకాలు భేష్ : ​రమేశ్ చంద్ మీనా

తెలంగాణ సివిల్ ​సప్లయ్స్​పథకాలు భేష్ :   ​రమేశ్ చంద్ మీనా
  • గుజరాత్​ ప్రిన్సిపల్ ​సెక్రటరీ రమేశ్ చంద్ మీనా ప్రశంస 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సివిల్​సప్లయ్స్​ డిపార్ట్​మెంట్ ​అమలు చేస్తున్న పథకాలను గుజరాత్ స్టేట్​ సివిల్​ సప్లయ్స్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ  ​రమేశ్ చంద్ మీనా అభినందించారు. మంగళవారం ఆయన రాష్ట్ర సివిల్​సప్లయ్స్​ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్​చౌహాన్​తో కలిసి  హైదరాబాద్​లో పర్యటించారు. ఈ సందర్భంగా పంజాగుట్ట ఏజీ కాలనీలోని రెండు జన్ పోషణ్ కేంద్రాలను సందర్శించారు. రాష్ట్రం అవలంబిస్తున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈపాస్​) విధానాన్ని  ​రమేశ్ చంద్ మీనా ప్రశంసించారు.

ఈ విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులకు రేషన్​పంపిణీ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడాన్ని అభినందిం చారు. అనంతరం సివిల్​సప్లయ్స్​కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీఎస్​ చౌహాన్ సంస్థ కార్యకలాపాలను ఆయనకు తెలిపారు. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాల అమలు తీరును  వివరించారు. ప్రధానంగా కొనుగోలు సెంటర్ల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ, సన్న వడ్లకు రూ.500 బోనస్, రేషన్​ ద్వారా సన్న బియ్యం పంపిణీని రమేశ్ చంద్ మీనా ప్రశంసించారు. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం ఎగుమతి చేయడం చారిత్రాత్మకమని  రమేశ్​చంద్ మీనా పేర్కొన్నారు.