
- రూ. 2 వేల జరిమానా
- కోర్టు ధిక్కరణపై హైకోర్టు తీర్పు
గుంటూరు: కోర్టు ధిక్కరణకు పాల్పడిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. నగరంలోని యడవలి వారి సత్రాన్ని ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిష నర్లకురూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ అమలు చేయకపోవడంతో పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయిం చారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ఆమెను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.