Guru Purnima 2024: చదువు, ఉద్యోగంలో మంచి జరగాలంటే.. ఆ రోజు ఈ పూజ ఇలా చేయాలి..!

Guru Purnima 2024: చదువు, ఉద్యోగంలో మంచి జరగాలంటే.. ఆ రోజు ఈ పూజ ఇలా చేయాలి..!

ఆషాఢమాసం  జరుగుతుంది.  క్రోధి నామ సంవత్సరంలో జనాలు కోప స్వభావం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు.  క్రోధానికి ఉపశమనంగా కొన్ని పూజలు చేయాలని అంటున్నారు పండితులు. ఇక గురు పౌర్ణమి రోజు నాలుగు శుభయోగాలు ఏర్పడుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  ఆరోజు (జులై 21)  గురువును పూజిస్తే కెరీర్​ ఉన్నత శిఖరాలను అందుకుంటారని జ్యోతిష్య గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఆరోజు  ఎలాంటి యోగాలు ఏర్పడుతాయి.. ఎవరెవరిని పూజించాలో తెలుసుకుందాం.  .

హిందూ మతంలో గురు పూర్ణిమ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున పంచమ వేదం మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మదినం అని  పండితులు చెబుతున్నారు.  అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. 

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పౌర్ణమి రోజున  ( జులై 21) అనేక అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరుగుతున్నాయి.  ఈ ఏడాది (2023) గురుపౌర్ణమి రోజున నాలుగు యోగాలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు.  దీంతో ఈ ఏడాది గురు పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే గురుపౌర్ణమి రోజున లోకాలకు గురువుగా వ్యవహరించబడే వ్యాస మహర్షితో పాటు.. విష్ణుమూర్తిని.. పరమేశ్వరుడిని పూజించాలని  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా గురువును పూజించడం వలన కెరీర్‌లో పురోగతికి మార్గం సుగమం అవుతుంది. 

 పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ జూలై 20, శనివారం సాయంత్రం 05:59 గంటలకు ప్రారంభమై జూలై 21 ఆదివారం సాయంత్రం 03:46 గంటలకు ముగుస్తుంది. పెరుగుతున్న చంద్రుడుని దృష్టిలో ఉంచుకుని గురు పౌర్ణమి పండుగను జూలై 21 న జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పౌర్ణమి రోజున అనేక అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఏడాది గురు పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగింది.గురు పౌర్ణమి రోజున చేసే పూజలు, దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఏ యోగాలు ఏర్పడనున్నాయంటే

ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పండుగను ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఏడాది పౌర్ణమి రోజున ఉదయం 05.37 గంటలకు సర్వార్థ సిద్ధి యోగం ప్రారంభమవుతుంది.  ఈ యోగం అర్ధరాత్రి 12:14 గంటలకు ముగుస్తుంది. దీనితో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి 12.14 వరకు ఉంటుంది. ఆ సమయంలో శివ పరిఘ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతన్నారు.  ఇంకా   శ్రవణ నక్షత్రంతో పాటు ప్రీతి యోగం కూడా ఏర్పడుతోంది. అంతే కాకుండా ఉదయం నుంచి రాత్రి 09.11 గంటల వరకు విష్కంభ యోగం ఉండనుంది.

ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటే..

  • గురు పౌర్ణమి రోజున శాస్త్రోక్తంగా గురువును, విష్ణువును పూజించిన వారికి మోక్షం లభించడమే కాదు కెరీర్‌లో పురోగతికి మార్గం సుగమం అవుతుంది.
  • గురు పౌర్ణమి రోజున గీతా పఠించిన తర్వాత కొంత సమయం పాటు గోవుకు సేవ చేయండి. ఇది కెరీర్‌లో లాభాలను అందిస్తుంది.
  • వ్యాస పీఠం ఏర్పాటు చేసుకుని చందనంతో దానిపై 12 సరళ, 12 క్షితిజ సమాంతర రేఖలను గీయండి. అనంతరం గురు పూజ కు శ్రీకారం చుట్టండి.
  • పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు మొదలైన పూజా సామగ్రితో వేద వ్యాసుడిని పూజించండి. ఈ రోజున గురుదీక్ష తీసుకునే సంప్రదాయం కూడా ఉంది.
  • గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్స్ అవసరమైన వారికి దానం ఇవ్వండి. ఇది జాతకంలో గురు గ్రహాన్ని బలపరుస్తుంది.
  • హిందూ మత గ్రంథాలలో గురువు మహిమ అనేక రూపాలలో వివరించబడింది. ప్రజలు తమ కృతజ్ఞతలను తెలియజేయడానికి గురు పౌర్ణమి రోజున గురువుకు ప్రత్యేక పూజలు చేయండి.
  • గురువుకు కుంకుమ పెట్టి, పూలమాల వేసి సత్కరించండి. దుస్తులు, పండ్లు, పూలు, బహుమతులు అందజేసి ఆశీర్వాదం అందుకోండి.

గురు పౌర్ణమి చరిత్ర, ప్రాముఖ్యత

గురు పౌర్ణమి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని సూచిస్తుందని  విశ్వాసం. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలు, జీవన నైపుణ్యాలను పరిచయం చేస్తారు. ఇవి స్టూడెంట్స్ పెరిగేకొద్దీ బయట ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియజేస్తుంది.

బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఈ రోజున తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని నమ్ముతారు. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ఐదు వారాల తర్వాత బుద్ధుడు బుద్ధగయ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌కు మారాడు. అక్కడ పౌర్ణమి రోజున తన భోధనలను ప్రజలకు వినిపించాడని బౌద్ద గ్రంధాల ద్వారా తెలుస్తోంది. అందుకే గౌతమ బుద్ధుని అనుచరులు ఆయనను ఆరాధించడానికి ఈ రోజును గురు పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు. బౌద్ధులకు ఆషాఢ పౌర్ణమి తిధి ముఖ్యమైనది.