
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేయడం చారిత్రాత్మకమన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు.. ప్రభుత్వ నిర్వహించిన సర్వే లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణం ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండడటమేనన్నారు. ఓటు హక్కుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పారు. గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం బిపిఎల్, ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని తాను సీఎంకు లేఖ రాశానన్నారు.
ALSO READ | పంచాయతీ ఎలక్షన్కు రెడీ కావాలి : కలెక్టర్ రాజీవ్గాంధీ
రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలన్నారు గుత్తు సుఖేందర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. గత ప్రభుత్వం హాయంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12,728 గ్రామపంచాయతీల్లో బీసీలకు రిజర్వేషన్ చేసిన స్థానాలు2625.. ఎంపిటిసి ఎన్నికల్లో మొత్తం 5781 స్థానాలకు గాను అందులో బీసీలకు కేటాయించిన స్థానాలు 1, 224 అని తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.