
ఖైరతాబాద్, వెలుగు: తెలుగు భాషను, సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక -సారస్వత సంఘం (ఇట్క్లా) ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఇట్క్లా -2025 విశ్వ తెలుగు వెలుగు పురస్కారాలను అందజేశారు. ఇట్క్లా అధ్యక్షుడు డాక్టర్ ధర్మారావు అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై పురస్కారాలను అందజేశారు.
పురస్కారాలు అందుకున్న వారిలో మృదంగ మాస్ట్రో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావు, రైల్వే శాఖ మాజీ జీఎం చేబియ్యం రామకృష్ణ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ ఎ. నటరాజ్, డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ ఉన్నారు. గుత్తా సుఖేందర్రెడ్డిని ధర్మారావు సత్కరించి మోమెంటో అందజేశారు.