పెద్దపల్లి జిల్లాలో వడగళ్ల వాన

పెద్దపల్లి జిల్లాలో వడగళ్ల వాన

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు1896 మంది రైతులకు చెందిన 2637 ఎకరాల్లో పంట దెబ్బతింది. పెద్దపల్లి, సుల్తానాబాద్​, కాల్వ శ్రీరాంపూర్​, జూలపల్లి,  ఎలిగేడు, ధర్మారం  మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వరి, మొక్కజొన్న, నువ్వులు,  పచ్చిమిర్చి, ఎండు మిర్చి, టమాట, బెండకాయ, ఇతర కూరగాయల పంటలు వడగళ్ల వానకు దెబ్బ తిన్నాయి. శనివారం పెద్దపల్లి వ్యవసాయాధికారులు నష్టపోయిన పంటను, రైతులను కలిసి వివరాలు సేకరించారు.