ప్రస్తుతం ప్రశాంత్ వర్మ (Prasanth Varma) వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. హనుమాన్ క్లైమాక్స్ లోనే జై హనుమాన్ ఉంటుందని రివీల్ చేస్తూనే ప్రకటించాడు.అంతేకాదు జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశాడు.
ఈ ఒక్క సినిమానే కాకుండా..అధీర(Adhira)అనే సినిమా కూడా రాబోతుందని తెలిపాడు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి(Kalyan Dasari)హీరోగా పరిచయం అవుతున్నారు.ఇక అంతేకాకుండా..అనుపమతో ఆక్టోపస్ కూడా ఉంటుందని కూడా తెలిపాడు.
ఇక అసలు విషయానికి వస్తే..ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh)తో ప్రశాంత్ రాక్షసుడు తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.ప్రశాంత్ చెప్పిన కథకు రణ్వీర్ సింగ్కు కూడా ఒకే చెప్పగా..షూటింగ్ కూడా త్వరలో షూరుకానుందని టాక్ తెలుగు బాలీవుడ్ మీడియాలో కూడా వినిపించింది.అయితే,రణ్వీర్ -ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీ అంతే త్వరగా అటకెక్కిందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందుకు కారణం లేకపోలేదు.
తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అందులో "ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు"అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు.ఆ పోస్ట్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కు తగులుతుందని,కావాలని ప్రశాంత్ వర్మ ఈ పోస్ట్ పెట్టాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే,ఇపుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాక్షసుడు సినిమాను దాదాపుగా ఆపేసినట్లే అంటూ సినీ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది.మరి,ఎలాగైనా బాలీవుడ్ లో మరో స్టార్ హీరోతో..అదే కథతో సినిమా తీసి శభాష్ అనిపించుకో అన్న అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఏదేమైనా,మైత్రి మేకర్స్ రాక్షసుడు సినిమాపై అప్డేట్ ఇస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అంతవరకు ఏమవుతుందో చూడాలి.
One day you realise every rejection was a blessing in disguise! :)
— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024