హనుమాన్ జయంతిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ; రాజేశ్​చంద్ర

హనుమాన్ జయంతిని  ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ; రాజేశ్​చంద్ర
  • కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డి టౌన్, వెలుగు :  హనుమాన్​ జయంత్యుత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ రాజేశ్​ చంద్ర జిల్లావాసులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ర్యాలీ రూర్లను పరిశీలించి, హిందూ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. నేటి ర్యాలీ పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి,  సీఐ చంద్రశేఖర్​రెడ్డి, ఎస్​బీ సీఐ తిరుపతయ్య పాల్గొన్నారు. 

సామాన్యులకు ఇబ్బంది కొలుగొద్దు..-నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

బోధన్, వెలుగు : హనుమాన్​ ర్యాలీలో సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిజామాబాద్​జిల్లావాసులకు సూచించారు. శుక్రవారం బోధన్ లోని అప్నాఫంక్షన్ హాల్​లో హనుమాన్ జయంతి ర్యాలీ ఆర్గనైజర్లతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. భక్తిశ్రద్ధలతో హనుమాన్​ జయంతి నిర్వహించుకోవాలని, డ్రోన్ల వాడకాన్ని నిషేధించామన్నారు.  ఈ సందర్భంగా హనుమాన్ ర్యాలీ రూట్ మ్యాప్​ను  పరిశీలించారు. 

అనంతరం బోధన్​ పట్టణ పోలీస్​ స్టేషన్​ను పరిశీలించి సైబర్​ నేరగాళ్లపై నిఘా ఉండాలని, గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, పట్టణ, రూరల్, రుద్రూర్​ సీఐలు వెంకట నారాయణ, విజయ్​బాబు, కృష్ణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు మచ్చేందర్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.