ఔను మేం విడిపోయాం..విడాకులపై హార్దిక్ పాండ్యా పోస్ట్

ఔను మేం విడిపోయాం..విడాకులపై హార్దిక్ పాండ్యా పోస్ట్

 విడాకులపై వస్తున్న పుకార్లకు టీమిండియా ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా  ఫుల్ స్టాప్ పెట్టాడు. తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు  ఇన్ స్టాలో అనౌన్స్ చేశాడు. నటాషాతో నాలుగేళ్ల బంధానికి గుడ్ బై చెప్పినట్లు పోస్ట్ చేశాడు. పరస్పర అంగీకారంతో   తాము  విడిపోయామని చెప్పాడు.  ఇది  తమకు కఠినమైన నిర్ణయం.. తన కుమారుడు అగస్త్యకు మంచి తల్లిదండ్రులుగా ఉంటామన్న పాండ్యా... ఇలాంటి సమయంలో  తమ ప్రైవసీకి భంగం కల్గకుండా  తమ నిర్ణయాన్ని గౌరవించాలని కోరాడు. జీవితంలో  తమకు సపోర్ట్ ఇవ్వాలని కోరాడు పాండ్యా.


పెళ్లికి ముందే   రెండేళ్లు డేటింగ్  చేసిన వీళ్లిద్దరు  2020 మే 31న  పెళ్లి చేసుకున్నారు.  కొన్ని రోజులుగా పాండ్యా విడాకులపై వార్తలు వస్తున్నాయి.  మార్చి 4న నటాషా పుట్టిన రోజు సోషల్ మీడియాలో  తన భార్యకు పాండ్యా ఎలాంటి విషెష్ చెప్పలేదు. నటాషా కూడా తన  ఇన్ స్టా అకౌంట్లో  పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. అప్పటి నుంచి వీళ్లు విడిపోయారని ప్రచారం జరిగింది.  ప్రస్తుతం నటాషా కొడుకు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిందని తెలుస్తోంది. 
 
ఇటీవల టీ20 వరల్డ్ కప్   గెలిచాక కూడా పాండ్యా చాలా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.  మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాండ్యా..గత ఆరు నెలలుగా తన జీవితంలో ఎంతో బాధను అనుభవించానని..ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యాడు.