మెదక్ జిల్లాలో రెండు రైస్​ మిల్లులపై క్రిమినల్ ​కేసులు

మెదక్  జిల్లాలో రెండు రైస్​ మిల్లులపై క్రిమినల్ ​కేసులు

మెదక్​, వెలుగు: టార్గెట్​మేరకు సీఎంఆర్​ఇవ్వనందుకు జిల్లాలో మరో రెండు రైస్​మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు సివిల్ సప్లై డీఏం హరికృష్ణ తెలిపారు. హవేలి ఘనపూర్​శారదా ట్రేడర్ రైస్​మిల్​కు 1,765 టన్నుల ధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. అందుకుగాను 1,183 టన్నుల సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉండగా కేవలం 230 టన్నులు మాత్రమే ఇచ్చారని తెలిపారు.

ఇంకా 953 టన్నుల సీఎంఆర్​ ఇవ్వకపోగా, సదరు రైస్​ మిల్లును తనిఖీ చేయగా రూ.4.75 కోట్ల విలువైన 1,422 టన్నుల ధాన్యం లేకపోవడంతో క్రిమినల్​ కేసు నమోదు చేసినట్టు వివరించారు. అలాగే ఇదే మండల పరిధి బూర్గుపల్లిలోని భాగ్యలక్ష్మి ట్రేడర్స్​ రైస్​ మిల్లుకు 784 ధాన్యం సరఫరా చేయగా 526 టన్నుల సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉందన్నారు. కేవలం 114 టన్నుల సీఎంఆర్​ మాత్రమే సరఫరా చేసి 411 టన్నుల సీఎంఆర్​ ఇవ్వలేదన్నారు. రూ.2 కోట్ల విలువైన సీఎంఆర్​ ఇవ్వనుందుకు గాను సదరు మిల్లుపై క్రిమినల్​కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సంబంధిత మిలర్ల నుంచి ఆర్​ ఆర్​యాక్ట్​కింద రికవరీకి చర్యలు తీసుకుంటామని డీఎం చెప్పారు.