మేం సక్కగా పాలించలే.. అందుకే ప్రతిపక్షంల కూసోబెట్టిన్రు : హరీశ్ రావు

మేం సక్కగా పాలించలే.. అందుకే ప్రతిపక్షంల కూసోబెట్టిన్రు : హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడుస్తోంది. బడ్జెట్ పై ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శిలు గుప్పిస్తున్నారు. ఇందుకు ధీటుగా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని వాటన్నిటిని సరిచేస్తూ వస్తున్నామని చెప్పారు. 

పించన్ల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని తెలిపారు. 5 వేల మందికి డబుల్ పెంచన్లు ఇచ్చారని చెప్పారు. .ఈ వ్యాఖ్యలకు హరీశ్ రావు స్పందిస్తూ తాము సరిగ్గా చేయలేదు కాబట్టే ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్పారు.