
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం అసెంబ్లీలో కలిశారు. అలాగే, మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్టు మర్రి రాజశేఖర్రెడ్డి చెప్పారు. ఈ భేటీ అనంతరం మీడియాతో హరీశ్రావు మాట్లాడారు. సీతాఫల్మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలిసి సీఎం రేవంత్ను కలిశానని చెప్పారు.
గతంలో కేసీఆర్ సీతాఫల్మండి కళాశాలకు రూ.32 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఆ పనులను రేవంత్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. కాగా..రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హరీశ్రావు మొదటిసారి ఆయనను కలిశారు.