సార్.. మమ్మల్ని టీవీల చూపెట్టండి.. స్పీకర్ కు హరీశ్ రిక్వెస్ట్

సార్.. మమ్మల్ని టీవీల చూపెట్టండి.. స్పీకర్ కు హరీశ్ రిక్వెస్ట్

తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తాము మాట్లాడేప్పుడు స్క్రీన్ పై చూపెట్టాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు కెమెరా తమ వైపు తిప్పడం లేదన్నారు..ఇటీవల రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో మాట్లేటప్పుడు కెమెరాల్లో చూపెట్టలేదని అన్నారు..ఆయన వారసులు మీరు కూడా ఇక్కడ అలా చేయకూడదన్నారు. హరీశ్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అలాంటిదేమి లేదని.. అందరిని కెమెరాలో చూపెడుతున్నామని చెప్పారు. ఎలాంటి వివక్ష లేదన్నారు. 

తెలంగాణలో దశ,దిశ లేని పాలన నడుస్తోందన్నారు మాజీమంత్రి హరీశ్ రావు.  బీఆర్ఎస్ ను విమర్శించడం తప్ప బడ్జెట్ లో మరేమీ లేదన్నారు. 8 నెలల రాష్ట్ర పాలనలో సాధించిన విజయం ఏమిటో చెప్పాలన్నారు. బడ్జెట్ లో వాస్తవాలు విస్మరించారనన్నారు. బీఆర్ఎస్  టార్గెట్ గానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు.