
పటాన్చెరు, వెలుగు: ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులోని జీఎంఆర్ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ హామీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ఇస్తామని చెప్పారని దాన్ని ఇంకా నెరవేర్చలేదన్నారు. అందుకని ఎవ్వరూ కరెంటు బిల్లులు కట్టవద్దన్నారు. రైతుబంధు, పెన్షన్లు, రైతు బీమా ఇంకా అమలు కాలేదన్నారు.
జనవరి నెల పెన్షన్లు ఎగరగొట్టిన కాంగ్రెస్ పార్టీ 48 లక్షల మంది పేదల కడుపు కొట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో సుమారు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారన్నారు. పార్లమెంట్ఎన్నికల్లో మెదక్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పటాన్ చెరు బస్టాండ్ ఏరియాలో ఆటోడ్రైవర్లను కలిసి మాట్లాడారు. ప్రతాపరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.