
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ పాలన ఆగమయ్యిందన్నారు. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదన్నారు. ఢిల్లీలో ధర్నాకు రేవంత్ పిలిచినా రాహుల్ గాంధీ రాలేదని ఎద్దేవా చేశారు.కేసీఆర్ తెలంగాణను నిలబెడితే..రేవంత్ పడగొట్టారని విమర్శించారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వైపు చూస్తోందన్నారు హరీశ్ రావు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన హరీశ్.. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ ఆర్ ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. 14 వేల కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతు రుణమాఫీ, 4వేల ఫించను, సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి .13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసం చేశారు . తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్,ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి . కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికిండు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్ దే. కేసీఆర్ ది సాగు భాష.. రేవంత్ రెడ్డి దీ చావు భాష. ఢిల్లిలో ధర్నా,సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాందీ రాలేదు. రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు.
దేవుడి మీద ఒట్టు పెట్టి.. దేవుడినే మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాళా తీశారు . మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఏడాది తిరగకుండానే 1లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది . ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ ను కోరుకుంటున్నారు. వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అని హరీశ్ అన్నారు.