బీజేపీలో చేరుతున్న స్వతంత్ర​ ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరుతున్న స్వతంత్ర​ ఎమ్మెల్యేలు

త్వరలో సావిత్రి జిందాల్ కూడా చేరే అవకాశం

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 48స్థానాల్లో గెలుపొంది హ్యాట్రిక్ ​విజయాన్ని సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. ముగ్గురు ఇండిపెండెంట్​అభ్యర్థులు కూడా ఆ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్ కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. బుధవారం కేంద్ర మంత్రి, హర్యానా ఇన్​చార్జ్​ ధర్మేంద్ర ప్రధాన్ ఇంట్లో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ సమక్షంలో ఇండిపెండెంట్​ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్ బీజేపీలో చేరారు. బీజేపీ రెబల్ ​క్యాండిడేట్​అయిన కడ్యాన్ గనౌర్ నుంచి గెలుపొందగా.. రాజేశ్ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. సావిత్రి జిందాల్ బీజేపీలో చేరికపై చర్చలు జరుగుతున్నాయని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ చెప్పారు.