
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్... ఇల్లు, ఆఫీస్లలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే.. ఇప్పుడు వాడుతున్న గూగుల్ క్రోమ్ వెర్షన్ని వెంటనే అప్డేట్ చేయాలి. లేదంటే మీ డేటా ఈజీగా స్కామర్ల చేతికి చిక్కుతుంది అని. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-–In) ప్రకారం, గూగుల్ క్రోమ్లో అనుమానంగా ఉన్నవాటిని గుర్తించారు.
అవి దాడి చేస్తే కంప్యూటర్ హ్యాకింగ్కి గురయ్యే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఒక కంప్యూటర్ లేదా నెట్వర్క్ ట్రాఫిక్తో నిండిపోవడం వల్ల పనితీరులో మార్పులొస్తాయి. దీన్నే డినైయల్ ఆఫ్ సర్వీస్ స్థితి (Dos) అంటారు. ఇలా జరిగితే రిమోట్ యాక్సెస్ తీసుకుని, డేటాను మార్చడం, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని బయటపెట్టడం వంటివి చేసే చాన్స్ ఉంది. ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
అదెలాగంటే.. క్రోమ్ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేయడానికి రెడీగా అప్డేట్లు ఉన్నాయో లేదో చూడాలి. అందుకోసం సెట్టింగ్స్లో ‘హెల్ప్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత అబౌట్ గూగుల్ క్రోమ్ సెలక్ట్ చేయాలి. ట్యాబ్ ఓపెన్ కాగానే డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్న అప్డేట్లు చూపిస్తుంది. అప్డేట్ మీద ట్యాప్ చేస్తే సరి.