
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రికల్ కంపెనీ హావెల్స్ నయనతార, -విఘ్నేష్ శివన్ దంపతులను దక్షిణ భారత మార్కెట్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల దక్షిణాదిలో మరింత బలపడగలమని తెలిపింది. ఈ జంటకు ఉన్న పాపులారిటీ తమకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.
వీరిద్దరూ కలసి నటించిన మొదటి యాడ్తమదేనని హావెల్స్ ఇండియా సేల్స్ విభాగం ప్రెసిడెంట్ పరాగ్ భట్నాగర్ చెప్పారు. హావెల్స్ ప్రీమియం ఫ్యాన్లు, చిన్న గృహోపకరణాలు, లైటింగ్ సొల్యూషన్స్, స్విచ్ లు, వాటర్ హీటర్లు, ఐఓటీ ఉత్పత్తులు, వైర్లు వంటివి అమ్ముతుంది.