కూతురికి తన వాటాల్లో 47 శాతం గిఫ్ట్​.. హెచ్​సీఎల్ ఫౌండర్​ శివ్​నాడార్​ నిర్ణయం

కూతురికి తన వాటాల్లో 47 శాతం గిఫ్ట్​.. హెచ్​సీఎల్ ఫౌండర్​ శివ్​నాడార్​ నిర్ణయం

న్యూఢిల్లీ:  హెచ్​సీఎల్ కార్పొరేషన్​ ఫౌండర్​ శివ్​నాడార్​ కంపెనీలోని తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోషిణీ నాడార్​ మల్హోత్రాకు కానుకగా ఇచ్చారు. వామా ఢిల్లీలోనూ వాటాలను అప్పగించారు. దీంతో ఆమె రెండు కంపెనీల్లో మెజారిటీ షేర్​హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. వీటిలో ఓటింగ్​ హక్కులపైనా ఆమెకు నియంత్రణ దక్కుతుంది. ​

వామా ఢిల్లీకి హెచ్​సీఎల్ టెక్​​లో ఉన్న 44.17 శాతం వాటా, హెచ్​సీఎల్ కార్పొరేషన్​లోని 0.17 శాతం వాటా కూడా రోషిణికే చెందుతుంది.