పెద్దమల్లారెడ్డిలో ఫీవర్​ సర్వే

పెద్దమల్లారెడ్డిలో ఫీవర్​ సర్వే

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు పీహెచ్ సీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన జ్వర సర్వేను ఆరోగ్య విస్తరణ అధికారి వేంకట రాములు పరిశీలించారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీలు జ్వర సర్వే నిర్వహించారు.  

ఈ సర్వేను పరిశీలించి ఆయన మాట్లాడారు.  ఇండ్ల ముందు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు.  ఆయన వెంట సెక్రటరీ లక్ష్మీ, ఏఎన్ఎం శ్యామల, అంగన్​వాడీ టీచర్​ జ్యోతి, ఆశావర్కర్లు వనజ, రేణుక, లావణ్య తదితరులు పాల్గొన్నారు.