
- వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట, వెలుగు : జోగిపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శనివారం ఆందోల్, జోగిపేట మున్సిపల్పరిధిలో పర్యటించారు. కులసంఘాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హత్నూరా, దౌల్తాబాద్, చిలప్చెడ్ మండలాల నుంచి ప్రజలు జోగిపేటకు వచ్చేందుకు ఆందోల్, అజ్జమర్రి గ్రామాల మధ్య రూ.80 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఆందోల్శివారులోని 12 ఎకరాల్లో నర్సింగ్కాలేజ్, దాని పక్కనే 150 పడకలతో సూపర్స్పెషాలిటి హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పారు.
సంగుపేట వద్ద హైవేను తాకుతూ అండర్పాస్ నుంచి అన్నాసాగర్ వరకు సెంటర్లైటింగ్తో రోడ్డు విస్తరించి డివైడర్ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆందోల్ చెరువు కట్ట సుందరీకరణ పనులతోపాటు చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి విహారకేంద్రంగా తీర్చిదిద్దుతాన్నారు. ఆర్యవైశ్య సంఘం కోరిన మేరకు వాసవి ఫంక్షన్ హాల్రిపేర్కు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
సంగారెడ్డి టౌన్ : జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీస్లో కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి సీఎస్ ఆర్నిధుల సేకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎస్ఆర్నిధులను విద్యా, వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తామన్నారు.
ఇప్పటివరకు పరిశ్రమలు సీఎస్ఆర్కింద ఇవ్వాల్సిన బకాయిలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పరిశ్రమల శాఖ జీఎం, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ఇన్స్పెక్టర్ఆఫ్ ఫ్యాక్టరీస్, సీపీవో, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.