దుర్గం చెరువు FTL పరిధిపై హైకోర్టులో విచారణ

దుర్గం చెరువు FTL పరిధిపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: దుర్గం చెరువు FTL పరిధి పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. దుర్గం చెరువు FTL పరిధిలో మొత్తం 160 ఎకరాల భూమి ఉందని అధికారులు చెబుతుండగా.. గత రికార్డుల ప్రకారం దుర్గం చెరువు FTL పరిధిలో కేవలం 65 ఎకరాలు ఉందని ప్రియతమ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. 

శుక్రవారం ( 2024, సెప్టెంబర్ 20) పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. దుర్గం చెరువు FTL పరిధిపై వివరణ ఇవ్వాలని రెవెన్యూ, నీటిపారుదల శాఖ, హెచ్ ఎండీఏకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను సోమవారానికి ( సెప్టెంబర్23) కు వాయిదా వేసింది హైకోర్టు.