ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.  బీఆర్ఎస్ పార్టీ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిన ఈ  ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు పిటీషనర్ల తరఫు న్యాయవాదులు.  దీనిపై ఇవ్వాళ హైకోర్టులో విచారణ జరగనుంది.