
మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎక్కువ టెంపరేచర్ తో జనం ఇళ్ల నుంచి బయటికి రావటం లేదు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జంతువులు అల్లాడిపోతున్నాయి. ఈక్రమంలోనే జంతువులను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పూణే లోని రాజీవ్ గాంధీ జూ పార్క్ లో ఎండ వేడి నుంచి జంతువులకు ఉపశమనం కలిగించేందుకు స్పింకర్లు, కూలర్లను ఏర్పాటు చేశారు జూ అధికారులు. ఏనుగులతో పాటు ఇతర జంతువులకు నీళ్లు కొడుతున్నారు. ఎండ వేడి నుంచి జంతువులు ఉపశమనం కలిగించేందుకు నీళ్లు కొడుతున్నామంటున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి
అసైన్డ్ భూముల్ని దోచుకోవడంపైనే కేసీఆర్ ఫోకస్
టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు