ఇందిరమ్మ ఇండ్ల కోసమే అధిక దరఖాస్తులు

ఇందిరమ్మ ఇండ్ల కోసమే అధిక దరఖాస్తులు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్​ ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 7,142 దరఖాస్తులు అందాయి. వాటిలో అధిక శాతం 4,860 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం రాగా, రేషన్​ కార్డుల కోసం 1,861 వచ్చాయి. పంచాయతీ రాజ్​ గ్రామీణా అభివృద్ధికి 175, విద్యుత్​ శాఖకు135, రెవెన్యూ పరమైన సమస్యలపై 46, ప్రవాసీ ప్రజావాణికి 01, ఇతర శాఖలకు 64 దరఖాస్తులు వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్​ చిన్నారెడ్డి తెలిపారు.