
- నాలుగు స్టేషన్లలో పెరుగుతున్న సైక్లిస్టుల తాకిడి
- సరిపోని 240 సైకిళ్లు మరిన్ని కావాలంటున్న సిటిజన్స్
- మరో ఏజెన్సీకి అవకాశం
హైదరాబాద్సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని హెచ్ఎండీఏ నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ కు క్రేజ్పెరుగుతోంది. సైక్లింగ్చేసే ఔత్సాహికుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. రెండేండ్ల కింద 24 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటు నిర్మించిన హెచ్ఎండీఏ.. తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఆయా చోట్ల సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
ప్రతి స్టేషన్లో సుమారు 100 వరకు ఎలక్ట్రిక్, ఇతర సైకిళ్లను అందుబాటులో ఉంచింది. ఒక్కో సైకిల్అద్దె గంటకు రూ.50 తీసుకుంటున్నారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదం కోసం పిల్లలు, యువతీ, యువకులు, మధ్య వయస్కులు వీకెండ్, సెలవు రోజులు, పండగ రోజుల్లో సైక్లింగ్చేసేందుకు వస్తున్నారు. మిగతా రోజుల్లో సాఫ్ట్వేర్ఎంప్లాయీస్తాకిడి ఉంటోంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఉన్న సైకిళ్లు చాలడం లేదు. చాలామంది గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. సమస్యను గుర్తించిన అధికారులు మరో ఏజెన్సీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
మరో ఏజెన్సీకి బాధ్యతలు
హెచ్ఎండీఏ సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. నాలుగు సైకిల్ స్టేషన్లలో కలిపి 240 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ఇవి సరిపోకపోవడంతో త్వరలో ఇప్పుడున్న స్టేషన్లకు సమీపంలోనే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏకు సంబంధించిన హైదరాబాద్గ్రోత్కారిడార్కార్పొరేషన్(హెచ్ జీసీఎల్) ఆధ్వర్యంలో మరో ఏజెన్సీని నియమించాలని నిర్ణయించారు.
ఇప్పుడు రెండు చోట్ల..
ప్రతిపాదనల్లో భాగంగా నానక్రామ్గూడ –తెలంగాణ పోలీస్ అకాడమీ (8.50 కి.మీ.) మార్గంలో ఒకచోట, నార్సింగి నుంచి కొల్లూరు వైపు (14.50 కి.మీ.) మార్గంలో మరో సైకిల్స్టేషన్ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లను 4.5 మీటర్ల వెడల్పు, త్రీ సైకిల్ లేన్తో రెండు వైపులా ఒక మీటర్ గ్రీనరీ ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ 100 నుంచి 300 సైకిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే వివిధ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు.
ఎంపికైన వారు ఏం చేయాలంటే..
ఎంపికైన సంస్థ ట్రాక్ నిర్వహణ, చూసుకోవడంతోపాటు సైకిళ్లను అందుబాటులో ఉంచాలి. కొత్తగా ఏర్పాటు చేసే స్టేషన్లలో టికెట్కౌంటర్లను, వెయిటింగ్ఏరియాల్లో ఇన్ఫర్మేటివ్సైన్బోర్డులను ఏర్పాటు చేయాలి. మూడేండ్ల పాటు నిర్వహణ చూడాల్సి ఉంటుంది. రెండో ఏజెన్సీ కోసం పిలిచే టెండర్లలో ప్రస్తుత ఏజెన్సీ పాల్గొనేందుకు అనుమతి ఇవ్వరు. పూర్తిగా కొత్త వారికే కేటాయిస్తారు. ఒక్కో స్టేషన్లో 300 వరకూ సైకిళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. లైనెన్స్ఫీజుగా హెచ్ఎండీఏ ఏడాదికి రూ.4,500 వసూలు చేయాలని నిర్ణయించింది.
సైకిళ్ల అద్దె ఇలా..
సైకిల్ స్టేషన్లలో అద్దెకు ఇచ్చే సైకిళ్లకు ధరలను కూడా నిర్ణయించారు. సాధారణ రోజుల్లో పెడల్ బైక్ అయితే గంటకు రూ.50, టెండర్బైక్అయితే గంటకు రూ.100, ఎలక్ట్రిక్ బైక్ అయితే గంటకు రూ.80 తీసుకుంటారు. వీకెండ్, పబ్లిక్హాలిడేస్లో అరగంటకు ఈ ధరలు ఉంటాయి. రెగ్యులర్గా సైక్లింగ్కు వచ్చే వారి నుంచి డిపాజిట్(రిఫండబుల్) రూ.500 వసూలు చేస్తారు. కేవలం గంట సేపు తొక్కుకునే వారైతే రూ.300 డిపాజిట్చేయాలి. రోజూ సైక్లింగ్కు వచ్చేవారు రూ.99 కట్టి అన్లిమిటెడ్గా తొక్కుకోవచ్చు. వీక్లీ వచ్చే వారు రూ. 349, నెలకు అన్లిమిటెడ్గా అయితే రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది.