ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 68 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 68 మంది మృతి

 భారీ వర్షాలు ఆఫ్ఘనిస్థాన్‌ అతలాకుతలంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్‌ లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలల్లో 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్డు తెగిపోయానని, దాదాపు వేల సంఖ్యలో ఇండ్లు కూలిపోయానని అక్కడి అధికారులు చెబుతున్నారు.

4వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 2వేల కంటే ఎక్కువ దుకాణాలునీటిలో మునిగిపోయాయని ఆఫ్ఘనిస్తాన్ సమాచార విభాగం అధికారులు వెల్లడించారు.  గతవారం ఆఫ్టనిస్తాన్ లో కురిసిన భారీవర్షాలకు 315 మంది చనిపోయారు. బుధవారం ఘోర్ ప్రావిన్స్‌లోని నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే ప్రయత్నంలో ఆఫ్ఘన్ వైమానిక దళం హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోయి ఒకరు మృతి చెందారు.

12 మంది తీవ్రంగా గాయపడ్డారు.  భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని అభ్యర్థించారు. అయితే వరద బాధితులకు WFO ఆహారం, సహాయం అందించేందుకు సిద్దమైంది. బగ్లాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించేందుకు ట్రక్కులు వెళ్లే పరిస్థితి లేదని ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా బాధితులకు ఆహారం అందించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు WFO తెలిపింది.