జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన.. సింగరేణిలో నిలిచిన బొగ్గ ఉత్పత్తి

జయశంకర్  భూపాలపల్లి  జిల్లాలో కుండపోత వాన.. సింగరేణిలో నిలిచిన బొగ్గ ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా సుమారుగా 4 వేల టన్నులకు పైగా  బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు సుమారు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

Also Read :- 4 వారాల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి

మరోవైపు ఎడతెరిపి లేని వర్షంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుండపోత వర్షంతో జిల్లాలోని చెరువులు, కాలువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు.