మైలార్ దేవ్ పల్లిలో భారీ వర్షం

మైలార్ దేవ్ పల్లిలో భారీ వర్షం

శంషాబాద్, వెలుగు: మైలార్‌‌దేవ్‌ పల్లి డివిజన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి దుర్గానగర్ చౌరస్తా వద్ద కాటేదాన్ నుంచి ఆరాంఘర్, శంషాబాద్ వైపు వెళ్లే దారిలో వర్షపు నీరు భారీగా చేరింది. 

దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  రోడ్డుపై నిలిచిన నీరు పోయేలా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రైనేజీ పైపు లైన్ వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను క్లీన్ చేశారు.  శంషాబాద్ బస్టాండ్ లో వర్షం నీరు నిలవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.