వర్షాలపై సర్కార్ హై అలర్ట్.. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వర్షాలపై సర్కార్ హై అలర్ట్.. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

హైదరాబాద్: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, వాగు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‎ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిన్న (శనివారం) జిల్లా కలెక్టర్లతో వర్షాలపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‎లో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో వరదలు, వర్షాల పరిస్థితిని పర్వవేక్షించనున్నట్టు తెలిపారు. 

Also Read:-మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా

దీనికనుగుణంగా, సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 34లో విపత్తుల నిర్వహణా శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ తెరిచారు. ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 - 2345 4088 అనే నెంబర్‎ను కూడా ఏర్పాటు చేశారు.  వర్షాలు, వరదల  పరిస్థితిని జిల్లా కలెక్టర్లతో ఎప్పటి కప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయసహకారాలు, తగు సూచనలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తారు.