ఎన్ఆర్సీని ఒప్పుకోం.. యూసీసీని అనుమతించం: జార్ఖండ్​ సీఎం హేమంత్​

ఎన్ఆర్సీని ఒప్పుకోం..  యూసీసీని అనుమతించం: జార్ఖండ్​ సీఎం హేమంత్​
  • తేల్చిచెప్పిన జార్ఖండ్​ సీఎం హేమంత్​

రాంచీ: బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్​లో యూనిఫాం సివిల్​ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఇచ్చిన హామీపై ఆ రాష్ట్ర సీఎం హేమంత్​  సోరెన్  స్పందించారు. రాష్ట్రంలో యూసీసీనిగానీ, ఎన్ఆర్​సీనిగానీ అనుమతించబోమని తేల్చిచెప్పారు. గిరిజన సంస్కృతి, భూమి, హక్కులను పరిరక్షించేందుకు చోటానాగ్​పూర్​ టెనెన్సీ(సీఎన్​టీ), సంతాల్​ పరగణా టెనెన్సీ(ఎస్​పీటీ) చట్టాలకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుందని సోరెన్​ చెప్పారు.

“ఈ వ్యక్తులు (బీజేపీ) విషాన్ని చిమ్ముతున్నారు. గిరిజనులు, స్థానికులు, దళితులు, వెనుకబడిన తరగతులవారిని వీరు పట్టించుకోరు” అని విమర్శించారు. ఆదివారం గర్వాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సోరెన్ మాట్లాడారు. జేఎఎం నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు నక్సలిజానికి ఆజ్యంపోస్తున్నదని అమిత్ షా చేసిన కామెంట్స్​పై సోరెన్​ స్పందించారు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించేవారని, ప్రస్తుతం రెండు విడతల్లోనే పూర్తి చేస్తున్నారని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో నక్సలిజం తగ్గిందనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.