ఐఎన్ఎస్కు వెళ్లనున్న తొలి భారతీయుడు.. అసలు ఎవరీ శుభాన్షు శుక్లా..?

ఐఎన్ఎస్కు వెళ్లనున్న తొలి భారతీయుడు.. అసలు ఎవరీ శుభాన్షు శుక్లా..?

యాక్సియోమ్​–4 మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్​అభివృద్ధి చేసిన డ్రాగన్​ స్పేస్​క్రాఫ్ట్కు నాసా మాజీ ఆస్ట్రోనాట్​పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనుండగా పైలట్గా శుభాన్షు శుక్లా వ్యవహరించనున్నారు. యాక్సియోమ్​–4కు ఎంపికైన వ్యోమగాములు పెగ్గీ విట్సన్(అమెరికా), శుభాన్షు శుక్లా(ఇండియా), ఉజ్​నాన్ స్కీ(పోలెలండ్), టిబోర్​ కపూ(హంగేరీ)లు ఐఎస్ఎస్​కు చేరుకుని అక్కడ రెండు వారాలపాటు పరిశోధనలు చేసి భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) భాగస్వామిగా ఉన్నది.

యాక్సియోమ్​మిషన్–4లో భాగంగా భారత వైమానిక దళ గ్రూప్​ కెప్టెన్, ఇస్రో ఆస్ట్రోనాట్​శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెడితే ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారతీయుడిగానూ రోదసిలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగానూ శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. ఇస్రో చేపట్టబోయే మావనసహిత అంతరిక్ష మిషన్(గగన్​యాన్)కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా ఒకరు. జెఫ్​ బెజోస్​ బ్లూ ఆరిజిన్​ సంస్థ 2004లో చేపట్టిన న్యూషెపర్డ్(ఎన్​ఎస్​–25) మిషన్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​కు చెందిన గోపిచంద్​ తోటకూర అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా రికార్డు సృష్టించారు.

అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యక్తులు:
* 1984, ఏప్రిల్​లో రష్యా వ్యోమనౌక సోయాజ్​టి–11లో అంతరిక్షంలోకి వెళ్లి తొలి భారతీయుడిగా రాకేశ్​ శర్మ రికార్డు సృష్టించారు. 
* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా కల్పనా చావ్లా చర్రిలో నిలిచారు. 
* సునీతా విలియమ్స్​(2012, 2024) ఎక్కువ సమయం స్పేస్​వాక్​ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. 
* సబార్బిటల్​ ఫ్లైట్​లో ప్రయాణించిన తొలి ఇండియన్​ అమెరికన్​ స్పేస్​ టూరిస్ట్​గా, రోదసీలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళగా బండ్ల శిరీష రికార్డు సృష్టించారు. 
* రాజాచారి (2021), ఆండీ సాద్వని(2024)లో అంతరిక్షంలోకి వెళ్లారు.