బ్రేకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్

బ్రేకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి (Arthi) నుండి విడాకులు తీసుకున్నట్లు సోమవారం (సెప్టెంబర్ 9న) సడెన్గా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 15 సంవత్సరాల వివాహం తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు జయం రవి ట్విట్టర్ X  ద్వారా ప్రకటించాడు.

ఈ ప్రకటనలో తాను భార్య ఆర్తితో విడిపోతున్న విషయాన్ని జయం రవి వెల్లడించాడు. "ఎంతో బాధతో మీతో నా వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాత ఆర్తితో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను. తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాల వల్ల, అందరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను" అని రవి వివరించాడు.

తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని కూడా అతడు కోరాడు. "ఈ కష్ట సమయంలో మీ అందరూ నాతోపాటు మా కుటుంబ సభ్యుల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాను. మీకు మీరుగా ఎలాంటి అంచనాలకు వచ్చేసి పుకార్లు పుట్టించవద్దు. ఈ విషయాన్ని ప్రైవేట్ గానే ఉంచండి" అని రవి నోట్ ద్వారా తెలిపారు.

అలాగే "నా సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికే ఎప్పుడూ నా తొలి ప్రాధాన్యత. నేను అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ మీ జయం రవినే. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు నేను రుణపడి ఉంటాను" అని రవి అన్నాడు.

అయితే..ఈ మధ్య చాలా మంది స్టార్ కపుల్ ఇలాగే విడిపోవడానికి ముందు తమ తమ సోషల్ మీడియాలో పాత ఫోటోలను డిలీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నినెలలకు ముందు జయం రవి, ఆర్తి కూడా పాత ఫోటోలను కూడా డిలీట్ చేయడం గమనార్హం.

అయితే, తాజా సమాచారం ప్రకారం..ఆర్తి రవికి ఇన్‌స్టాగ్రామ్‌లో 160కి పైగా పోస్ట్‌లు ఉన్నాయి. పోస్ట్‌లో కేవలం ఆర్తి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఈ జంట కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతు వచ్చాయి. తాజా ప్రకటతో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి. 

Also Read :-  ఎన్టీఆర్తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మీటింగ్

జయం రవి, ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తితో 2009 నుండి వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరైన ఆరవ్, రవి 2018 చిత్రం 'టిక్ టిక్ టిక్'లో ఒక పాత్రను పోషించాడు.

ఆర్తి జయం రవిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడమే కాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తన భర్త అని గర్వంగా రాసుకుంది..'అతని బయో రీడ్ నేను ప్రభావితం చేయాలని ఆశించను, స్ఫూర్తిని పొందాలని ఆశిస్తున్నాను' అని ఇప్పటికీ రాసి ఉండటం విశేషం.

ఇక జయం రవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇదే సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సూపర్ హిట్ గా నిలిచింది.