రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన హీరో ప్రభాస్..

రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన హీరో ప్రభాస్..

కూతురు గాయత్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు సినీ నటుడు రాజేంద్రప్రసాద్. ఈ క్రమంలోనే పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆయనను స్వయంగా కలుస్తూ పరామర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ ను పరామర్శించడానికి హీరో ప్రభాస్ నేరుగా కూకట్‌పల్లి ఇందు విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లారు. ముందుగా గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ప్రభాస్.. అనంతరం రాజేంద్రప్రసాద్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ALSO READ | రిలీజ్ కి 2 రోజుల ముందే మా నాన్న సూపర్ హీరో సినిమా ప్రీమియర్ షోలు.

38 ఏళ్ల గాయత్రి ప్రొఫెషనల్ న్యూట్రీషియన్. గాయ‌త్రి కూతురు సాయితేజ‌స్విని మ‌హాన‌టి సినిమాలో చిన్న‌నాటి కీర్తిసురేష్ పాత్ర‌లో క‌నిపించింది. రాజేంద్రప్రసాద్ తల్లి కమలేశ్వరి దేవి ఆయన చిన్నతనంలోనే మరణించగా.. తన కుమార్తె గాయత్రిలోనే తన తల్లిని చూసుకుంటానని ఒకానొక సినిమా ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇపుడు కూతురు గాయ‌త్రి మరణం ఆయన్ను ఎంతగా బాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు.