Raj Tarun: 'పురుషోత్తముడు’ ట్రైల‌ర్ రిలీజ్..మాట కాదు ధర్మం అంటున్న రాజ్ తరుణ్

Raj Tarun: 'పురుషోత్తముడు’ ట్రైల‌ర్ రిలీజ్..మాట కాదు ధర్మం అంటున్న రాజ్ తరుణ్

టాలీవుడ్ యువ న‌టుడు రాజ్ త‌రుణ్ ఈమధ్య తన సినిమాల కంటే..ఆయన పేరే ఎక్కువ మోగుతుంది. ఒకవైపు మాజీ ప్రేయసి లావ‌ణ్య వివాదం న‌డుస్తుంటే..మ‌రోవైపు త‌న సినిమాల‌ను వరుసబెట్టి పూర్తి చేస్తున్నాడు. ఇప్ప‌టికే భ‌లే ఉన్నాడే సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో కొత్త సినిమా నుండి అప్డేట్ ఇచ్చేసాడు. ప్రస్తుతం రిలీజ్ కు దగ్గర్లో ఉన్న ‘పురుషోత్తముడు’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

రామ్‌‌‌‌ భీమన దర్శకత్వంలో శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్‌‌‌‌, ప్రకాష్‌‌‌‌ తెజావత్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజ్‌‌‌‌ తరుణ్‌‌‌‌ కి జోడిగా హాసిని సుధీర్‌‌‌‌ నటిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పురోషత్తముడు ట్రైలర్ ఫీల్ అండ్ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా ఉంది. 'ఒకయుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడు అయ్యాడు.. అలాగే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహల్లాదుడు మహనీయుడు అయ్యాడు.. మాట కాదు ధర్మం అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

టైటిల్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ట్రైలర్ చూస్తే స్టోరీ ప్లాట్ శ్రీమంతుడు సినిమా పోలి ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే, ఒక గ్రామంలో ఉన్న ప్ర‌జ‌ల‌ కోసం డబ్బున్న ఒక యువకుడు..తనకున్న స్టేటస్ ని పక్కనపెట్టి ఎలాంటి పనులు చేశాడనేది స్టోరీ అని తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి అనుభూతిని ఇవ్వనుందో చూడాలి. 

ఈ మూవీకి ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్‌ స్వరాలూ సమకూరుస్తుండగా..మురళీశర్మ, కౌసల్య, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ తదితరులు  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పురుషోత్తముడు జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.