Raj Tarun: లావణ్యతో ఇక మాట్లాడేది లేదు.. అన్నీ కోర్టులోనే: రాజ్ తరుణ్

Raj Tarun: లావణ్యతో ఇక మాట్లాడేది లేదు.. అన్నీ కోర్టులోనే: రాజ్ తరుణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ వివాదం సంచలనంగా మారింది. తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హీరో రాజ్ తరుణ్ ఇంకా లావణ్య గత 11 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉంటున్నామని, గుళ్లో పెళ్లికూడా చేసుకున్నామని, కానీ, కొంత కాలంగా రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోనున్నాడని, తనను పెట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలనీ ఫిర్యాదులో కోరింది. 

అయితే.. తాజాగా లావణ్య చేసిన ఫిర్యాదుపై స్పందించారు హీరో రాజ్ తరుణ్. ఈ విషయం గురించి రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలు. ఆమె పేరెంట్స్ చాలా మంచివాళ్ళు. కానీ, లావణ్య వేరు. ఆమెను ఎవరు మోసం చేయలేదు, బయపెట్టలేదు. ఆమెనే భయపెట్టేది. ఇంత జరిగాక ఆమె ఇక మాట్లాడేది ఏమీ లేదు. కోర్టులోనే లీగల్ గా చూసుకుంటాము.. అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.