Sharwanand: అది ఆయన్నే అడగండి.. శతమానంభవతి సీక్వెల్పై శర్వా షాకింగ్ కామెంట్స్

Sharwanand: అది ఆయన్నే అడగండి.. శతమానంభవతి సీక్వెల్పై శర్వా షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరో శర్వానంద్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా అంటే శతమానంభవతి అనే చెప్పుకోవాలి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కేవలం విజయమే కాదు ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇక నటుడుగా శర్వానంద్ కు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది శతమానంభవతి. అందుకే ఈ సినిమా ఆయన కెరీర్ లో చాలా ప్రత్యేకం. 

అలాంటి క్లాసిక్ సినిమాకు సీక్వెల్ అనూన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. తాజాగా ఈ సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో శర్వానంద్. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనంతరం నిర్వచిన మీడియా మీట్ లో రిపోర్టర్స్ శర్వాను శతమానంభవతి సీక్వెల్ గురించి అడిగారు. 

దానికి సమాధానంగా శర్వా మాట్లాడుతు.. దిల్ రాజు శతమానంభవతి సీక్వెల్ అనౌన్స్ చేసారా? అయితే ఆయన్నే అడగండి.. దాని గురించి, నాకు అయితే ఏం చెప్పలేదు.. అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు శర్వానంద్. దీంతో.. శతమానంభవతి సినిమాలో ఆయన నటించడంలేదని విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సీక్వెల్ లో ఆయన సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ విషయంలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.