సీమంతం ఫోటోలు షేర్ చేసి..తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

సీమంతం ఫోటోలు షేర్ చేసి..తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ తన సీమంతం ఫోటోలు షేర్ చేసి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. తనే మధ్యప్రదేశ్కి చెందిన హీరోయిన్ చిత్ర శుక్ల(Chitra Shukla). 2017లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మా అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ..తాజాగా తాను  తల్లి కాబోతున్నట్టు తన ఆనందాన్ని షేర్ చేసుకుంది.

Also read:-ఓటీటీలోకి విక్రమ్ లేటెస్ట్ హిట్ తంగలాన్‌..స్ట్రీమింగ్ డేట్ ఇదే

కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సాంప్రదాయబద్దంగా తన సీమంతం వేడుక ఘనంగా జరిగింది. తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..'నేను కూడా ఇలా చాలా సార్లు నన్ను నమ్మలేకపోతున్నాను' ఈ క్షణం చాలా ఆనందంగా ఉంది..మీ బ్లెస్సింగ్స్ కావాలంటూ..ట్యాగ్ చేసింది. ప్రస్తుతం తన సీమంతం వేడుక ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు, పలువురు నెటిజన్లు చిత్ర శుక్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే 2023 డిసెంబర్‌లో వైభవ్ ఉపాధ్యాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చిత్ర శుక్లా..మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్‌ అధికారిగా వైభవ్ పనిచేస్తున్నారు.బయోటెక్నాలజీ పూర్తి చేసిన చిత్రకు కాలేజీ రోజుల్లోనే వైభవ్‌తో ఉన్న స్నేహం ఆపై ప్రేమగా మారినాట్లు సమాచారం. 

 'పులి', 'నేను శైలజ' వంటి మూవీస్ లో సైడ్ డ్యాన్సర్‌గా చిత్ర శుక్ల. కనిపించింది. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ అయిపోయింది.ఆ తర్వాత తెలుగులో 'రంగుల రాట్నం', సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే, ఈమెకు వరుస అవకాశాలు వచ్చిన..అనుకున్నంత గుర్తింపు రాలేదు.