మూడేళ్ల క్రితం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. తాజాగా ఆమె మరో క్రేజీ చాన్స్ అందుకుంది. తమిళంలో కమెడియన్గా పేరొంది.. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సంతానం సరసన మీనాక్షి నటిస్తున్నట్టు తెలుస్తోంది.
‘దిల్లుకు దుడ్డు-3’ చిత్రంలో హీరోయిన్గా మీనాక్షిని తీసుకున్నారట. ఈ చిత్రాన్ని కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తుండగా ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు సంతానంకి జోడీగా నటించడంపై కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. అయితే ఆమె మాత్రం.. హీరో ఎవరైనా పాత్ర నచ్చితే కచ్చితంగా చేస్తానని చెబుతోంది.
మీనాక్షి ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘మట్కా’ చిత్రంతో పాటు విశ్వక్ సేన్కు జంటగా ఓ సినిమా, దుల్కర్ సల్మాన్కు జోడీగా ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్తో ‘గోట్’ చిత్రం చేస్తోంది. చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తోంది.